
TTD Announces 10-Day Vaikuntha Dwara Darshan Plan with Focus on Common Devotees

వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత – టీటీడీ కీలక నిర్ణయాలు
తిరుమల, నవంబర్ 18, 2025: రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు జరుగనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తిగా సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేలా టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం ఉదయం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు ఈ వివరాలు వెల్లడించారు.
వైకుంఠ ద్వార దర్శనాలపై ముఖ్య నిర్ణయాలు
🔹 10 రోజుల వైకుంఠ దర్శనాలు
డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు మొత్తం 10 రోజులు భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం పొందడానికి ఏర్పాట్లు.
🔹 164 గంటలు సామాన్య భక్తులకు
182 గంటల దర్శన సమయంలో దాదాపు 164 గంటలు సామాన్య భక్తులకు మాత్రమే కేటాయించాలని నిర్ణయం.
🔹 మొదటి 3 రోజులకు శ్రీవాణి & రూ.300 దర్శనాలు రద్దు
సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించడానికి:
- శ్రీవాణి దర్శనాలు
- రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు
డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో రద్దు.
🔹 ఈ–డిప్ ద్వారానే టోకెన్లు
మొదటి మూడు రోజులైతే:
- అన్ని టోకెన్లు పూర్తిగా ఆన్లైన్ ఈ-డిప్ ద్వారానే కేటాయింపు
- వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ప్లాట్ఫాంలలో రిజిస్ట్రేషన్
- తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సౌకర్యం
🔹 రిజిస్ట్రేషన్ తేదీలు
- నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు: ఈ–డిప్ రిజిస్ట్రేషన్
- డిసెంబర్ 2న: ఎంపికైన వారికి దర్శన సమాచారం పంపింపు
జనవరి 2 నుండి 8 వరకు టికెట్ కేటాయింపులు
- రోజువారీ 15,000 రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు
- రోజుకు 1,000 శ్రీవాణి టికెట్లు
- రెగ్యులర్ విధానంలో ఆన్లైన్లో బుకింగ్ అవకాశం
స్థానికుల టోకెన్లు
జనవరి 6, 7, 8 తేదీల్లో:
- రోజుకు 5,000 టోకెన్లు
- First In – First Out (FIFO) విధానంలో కేటాయింపు
ఇతర కీలక నిర్ణయాలు
🔸 ఆర్జిత సేవలు – పది రోజులపాటు రద్దు
వైకుంఠ ద్వార దర్శన కాలంలో ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయాలని నిర్ణయం.
🔸 ప్రివిలేజ్ దర్శనాలు రద్దు
అభ్యర్థనలు లేకుండా, కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శన సౌకర్యం.
🔸 సిఫార్సు లేఖలు స్వీకరించరు
స్వయంగా హాజరయ్యే ప్రోటోకాల్ VIPలను మినహా ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
పరకామణి కేసుపై బోర్డు కీలక తీర్మానం
భక్తుల భావాలను గౌరవిస్తూ:
- పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలనే నిర్ణయం
- ఎవరైనా ఇందులో భాగస్వాములైతే వారిపై కఠిన చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు
- సవ్యమైన దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి నివేదించాలని తీర్మానం
అమరావతిలో ఆలయ నిర్మాణం
నవంబర్ 27న అమరావతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రెండో ప్రాకారం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.
— టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడిన ప్రకటన

- tirumala farests
- Chittoor High Road Expansion: ₹37.41 Crore Sanctioned for 4-Lane Road from Kattamanchi to MSR
- D.K. Shivakumar: From Congress Troubleshooter to Karnataka Chief Minister
- ₹25 Crore Hare Krishna Temple Project Proposed in Chittoor, CM Assures Land Allocation
- Dr. M. Sudhakar Biography: From Renowned Doctor to Katpadi MLA and People’s Leader





